సమన్వయ దృష్టి
గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు, వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు వ్యవహార కార్యాలయము నుండి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.
జనసేన అను పేరుతో మీరు స్థాపించిన పార్టీ తో ప్రజలకు దేశానికి వీలు అయినంత మేలు జరగాలి అని కోరుకొనుచున్నాను. ప్రస్తుతమునకు రాష్ట్రంలో, దేశంలో వీలు అయినంత కేంద్రీకృత శక్తిని కూడా తీయాలి, వివిధ పార్టీల, అజండాల మధ్య ఒక ఏకత్వం రావాలి. ప్రజలు ప్రశాంతం గా ఉండాలి, నాయకుల మధ్య ఎటువంటి ఆవేశములు ఉండరాదు, ఏ పార్టీ గూర్చి, ఏ వ్యక్తి గూర్చి విమర్శించ వద్దు. అన్నీ పార్టీలను అజండాలను ఒక తాటి మీదకు తీసుకొని రాగలిగితే, మీరు చేసిన గొప్ప పని అవుతుంది, అ విదముగా మీరు ముఖ్యమంత్రి అవగలరు, మీ యొక్క వ్యక్తిగత జీవిత అనుభవం, ప్రజాధరణ కలిపి ప్రజలకు సూటిగా చేరువ అయితే , సమాజం లో మంచి మార్పు వస్తుంది. పండితుల సహకారముతో విశాలముగా వివరములు ఇవ్వండి. అందుకు నేను సహకరిస్తాను. ఇతర పార్టీల మమేకంతో ప్రశాంతమైన వాతావరణం సృష్టిద్దాం. నా మనసుని పూర్తీ స్థాయిలో లో వినియోగించనివ్వండి. నన్ను ఒక చోట 10 మంది పండితుల సమక్షంలో కొలువు ఎర్పాటు చేసి, నాకు ఆహ్వానం పంపించండి, నన్ను అందరి అత్మీయుడను అనుకోండి, మీ అత్మీయుడను అనుకోండి
ఆలస్యం చేయకుండా నేను కోరినట్లు చేయండి. త్వరలో అన్నీ పార్టీల మీటింగ్ పెడదాము. మీరు ముఖమంత్రి అయినా అవ్వకపోయినా మంచి పరిణామమునకు కీలకం అవుతారు.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment