Sunday, 13 January 2013

సమన్వయ దృష్టి ప్రేమస్వరూపులు సోదర సమానులు, తెలుగు చిత్ర సీమ కధా నాయకులు, సమాజ సంస్కార పరిరక్షణ కాంక్షులు, యోగ్యులు అయిన శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జుబ్లీ హిల్స్ హైదరాబాద్

సమన్వయ దృష్టి
           ప్రేమస్వరూపులు  సోదర సమానులు, తెలుగు చిత్ర సీమ 
కధా  నాయకులు, సమాజ సంస్కార పరిరక్షణ  కాంక్షులు, యోగ్యులు అయిన  శ్రీ శ్రీ  కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి  తమ ఆత్మీయులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, లార్డ్ జనరల్ అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు  డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, నుండి నమస్కరించి చేయు విన్నపము.

                   సమన్వయ దృష్టి ని కొత్త జాతీయ రాజకీయ పార్టీ గా ప్రకటించుటకు, మీ వంటి ప్రభావవంతుల  యొక్క సహకారము కోరుకొనుచున్నాను.  సమన్వయ దృష్టి  బలపడే కొలది, ప్రజలకు శాంతి సౌఖ్యములు అందుతాయి,  మీడియా చానల్స్ వారికీ  తమరి ద్వారా కోరునది ఏమి అనగా,  ఈమెయిలు సమాచారము పై  స్పందించి,  సమన్వయ శక్తిని  ఎంత అభివృద్ధి చేసుకొంటే అంత మంచిది  అని స్పష్టము చేయుచున్నాను.

              ప్రతి మనిషి మనసుకి మాటకి ప్రాధాన్యత ఇస్తే, పరిష్కారములు సమర్ధవంతుముగా, వేగా వంతముగా,  అనగా డొంక తిరుగుడు లేకుండా సమస్యలు పరిష్కారము అవుతాయి.  బలము ఉన్నవారు విర్రవీగి దుర్వినియోగం చేస్తున్నారు,  బలహీనులు మనకు ఎందుకులే అని ఊరుకోనుచున్నారు. తద్వారా జరగాల్సిన పరిష్కారము జరుగుట లేదు,   ఈ జగత్తు మనిషి మాట ఉంటేనే ఉన్నది   అని  గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను, మాట నిలిచిన జగత్తు నిలుచును అని పెద్దలు అన్నారు. 

                 చాలా  మంది నాయకులు మేము ప్రజలకోసం చేస్తున్నాము, పేద ప్రజల కోసం చేస్తున్నాం  అంటారు కాని,   మనిషి   మనసుకోసం,   మనస్పూర్తిగా గా ప్రవర్తించుట వలన లోకం నూతన పరిష్కారము వైపు వెళ్ళుతుంది.  వ్యక్తులు బాహ్య బలముతో, వ్యక్తీ స్వామ్యాలు వలన, వారి మనసు యొక్క  పూర్తి  నాణ్యతను  ఉపయోగించుకోలేరు.  ఎంత సేపు ఎవర్నో పొగడటం, ఎవరినో తిట్టడం తప్ప, వారికీ వారు సహజముగా స్పందించి, నిర్మణాత్మకముగా వ్యవహరించుట లేదు,  తమ బలం పెరగాలి అంటే, ఎదుటి వాడి బలం తగ్గించాలి అని అనుకొంటున్నారు చాలా మంది,  ఇది ఎంత సరి దిద్దుకొంటే అంత మంచిది.  ఎదుటి వాడి గొప్పతనమును అర్ధం చేసుకోవడం వలన,  మనుష్యులు  మధ్య సఖ్యత పెరుగుతుంది.    ధర్మ  నాలుగు పదముల పైకి వస్తుంది అను సత్యమును గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియ  జేసుకోనుచున్నాను.

             మనిషి అంటే మనసు అని  అర్ధము, మనిషిని నడిపించేది మనసు అని, అదే ప్రపంచమునకు ఆధారము   అని గ్రహించగలము.  మన రాజకీయ నాయకులు,    ప్రబుత్వం, ప్రతిపక్షం అని కాకుండా, రాజకీయ నాయకులు  ఒక  చోట చేరి, అంశాల వారీగా సమస్యలు పరిష్కరించుకొంటే, లోకం స్వర్ఘధామముగా  మారుతుంది అని గ్రహించగలరు.  చంద్రబాబు నాయుడు గారు లాంటి  పెద్ద మనిషి, మేధావితనమును, గొప్పతనమును వదిలిపిట్టి, రోడ్లమీద నడుస్తూ  అప్పటికి అప్పడు హామీలు గుప్పిస్తే, పనులు అవుతాయా,  70 శాతం లిటరసీ అభివృద్ధి చెందినది, మీడియా వుంది, గుజరాత్ లో  నరేంద్ర  మోడీ గారి వంటి నాయకుల ప్రచార  పద్దతిలో, ప్రజల ముందుకు వెళ్లి,  వీలు అయినంత పరిపాలన చేయవచ్చును, ప్రతి పక్ష నాయకులు  అయినా, ప్రబుత్వములొ ఉన్న వారు అయిన, పదవులతో సంభంధం లేకుండా
ప్రజా సేవ చేసినప్పుడే, నిజమైన ప్రజా స్వామ్యం వస్తుంది.  ఎవరి గోల వారిది అన్నట్లు ప్రవర్తిస్తే    సమాజంలో సంస్కారము ఎవరికి అభివృద్ధి చెందదు.    ఎక్కువ,  తక్కువలు  నిత్యం సమన్వయ    పడితేనే, నిజమైన పరిష్కారం  సంస్కారము అని గ్రహించగలరు అని మీ ద్వారా    ప్రజలను కోరుకొనుచున్నాను.  అ భగవంతుని అసీసులు అందరి పైన ఉండాలి   అని ప్రార్దించుచున్నాను.  మీ వంటి యువకులు ముందుకు వస్తే  సమన్వయ దృష్టి ని జాతీయ పార్టీగా  ప్రకటించి,  సమాజం లో అన్ని వర్గాల వారిని ప్రేమతో, ఒక తల్లి తండ్రి, గురువు వంటి భాద్యతతో  తీర్చి దిద్దుకోనవచ్చును. ఇప్పుడు సమాజం లో stagnation of thinking qualities  ని సరిదిద్దుకోనవలెను, అప్పుడు పరిష్కారము యిట్టె కనుగునవచ్చును.  తమరు కాలస్వరూపము పై పండితులను మేధావులులను ప్రోత్సహించి లోకమునకు వారు అభి ప్రయములు తెలియజేసి, కాలస్వరూపం యొక్క అభివృద్ధి కృషి చేయగలరు అని కోరుకొనుచున్నాను. సమన్వయ దృష్టిని  జాతీయ పార్టీగా, సూర్యుడు గుర్తు తో  పైకే తీసుకొని రావడం వలన సర్వ అమోధాకర శక్తి బలపడి లోకం స్వర్ఘదామముగా మారుతుంది అని గ్రహించగలరు.  ప్రజలు నిజాయితీగా ఉంటె  సమస్యలు ఉండవు, మానసా, వాచా, కర్మణా  ప్రవర్తిస్తే, లోకం  దివ్యంగా  ఉంటుంది.  కాలస్వరూపం పై పండితులు స్పందించుటకు మీరు కృషి చేయగలరు. మీడియా ఛానల్ వారిని కాలస్వరూపం యొక్క వివరములు లోకమునకు తీసుకొని వెళ్ళుటకు సూచన చేసి నడిపించగలరు.  సత్యం తెలియజేసి అందరిని ఆలోచించేటట్లు చేయడం వలన, లోకంలో   నూతన దివ్యత్వము అందరికి అందుతుంది. నా వివాహము స్వయంవరం  లో జరుగుటకు తమ వంతు సహకారము అందించగలరు, ఈ విదముగా నేను పెళ్లి చేసుకోవడం వలన, సమాజం లో పదిగురు ఒక మాట మీదకు వచ్చి, సమాజం గొప్పగా మారుతుంది అని గ్రహించగలరు.  సమన్వయ దృష్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం వలన, అనగా ఒక మనిషి ద్వారా ఈ విదముగా జరిగింది అనే సత్యం ప్రతి ఒకరికి చెబితే చాలు అని గ్రహించగలరు.   టీవి చానల్స్ ద్వారా నిరంతరం అందుబాటులో   ఉండి,  ఈ ప్రపంచమునే ఒక జండా క్రిందకి తీసుకొని రాగలము, ప్రజల తాత్కాలిక పోరాటాములతో , విలువైన సమయమును వృదా చేసుకోకుండా, నాణ్యమైన సమాజము కొరకు అందరూ కృషి చేయగలము.

               ఇక్కడ సమయం  వృధా అంటే, సాటి మనిషిని అర్ధం చేసుకోకపోవడమే, మాట  మంచి చూడకుండా, మాటలో గొప్పతనం పట్టించుకోకుండా దాటి వేయు దొరణి  వలన సమాజ నిభద్దత దెబ్బ తిట్టుంది. మీ సినిమాలతో బాటుగా మన ఇతర  హీరోల సినిమాలకు సంభందించిన పాటలు, కొన్ని సంభాషణలు కాలస్వరూపములో  ఒక గంటా గంటనర సమయములో నా ద్వారా ఇతర విశేషములతో బాటుగా వ్యక్తము అయినవి. ఇది ఏదో యద్రోచికముగా జరిగినది, లేకపోతె సిల్లి గా తీసుకోవలసినది కాదు, మొత్తం లోకం నాకు  మాటగా నా జిహ్వ కు అందినది అంటే తమ బోటివారు , భాద్యతతో తీసుకోవాలి, నన్ను విన్న వారు కూడా  నిర్లక్ష్యముగా తీసుకొన్నారు. ఇది అంతా నా అవసరం అన్నట్లుగా ఇప్పటికి భావిస్తున్నారు, జరిగిన విశేషములు సహజముగా ఉన్నది ఉన్నట్లు తీసుకోవడం లేదు, ఇందులో తట్టుకోలే నట్లు ప్రవర్తించడం కంటే, భాద్యతగా మాట వివరణను గ్రహించి, ప్రజలకు తెలియజేస్తే లోకం నూతన ఉత్సాహమును సంతరించుకొంటుంది,  హీరోలకు, ఇప్పుడు ఉన్న ప్రముఖులకు విలువ తగ్గిపోతుంది అని అనుకొంటే తప్పు,  నన్ను ఒక పద్దతి ప్రకారము పరిగణించి, లోకమునకు జాగ్రత్తగా చెప్పుటలో భాద్యత తీసుకొంటే, సమాజం కొంత తనమును సంతరించుకొంటుంది అని గ్రహించగలరు. సమాజములో ఎకువ తక్కువ, జ్ఞానం అజ్ఞానం, గొప్పతనం లోటు, మంచి చెడు ఎప్పుటి కి అప్పుడు సమన్వయము చెంది నప్పుడే లోకం సంస్కరించబడుతుంది.
ఈ ప్రపంచం తీరు తెన్నులు అర్ధము చేసుకొని, జాగ్రత్తగా ముందుకు వెళ్ళమని భగవంతుంది  ఉద్దేశము అని గ్రహించగలరు. నేను  అనుకూలముగా ముందుకు వస్తున్నా   అవమానించి, నిర్లక్ష్యముగా నవ్వులాటలు గా తీసుకొని,స్పందించకుండా ఇతరులకు  వాస్తవము తెలియజేయకపోవడం వలన, సమాజములో భగవంతుడు చేస్తున్న  అప్రమత్తత ప్రజలు అందుకొన లేకపోయినారు. సమాజం లో నేను కోరుకోన్నంత మార్పు వచ్చినా, వ్యక్తిగా నన్ను నిర్లక్ష్యము చేయుట వలన నాకు వ్యక్తిగా నష్టం వచ్చినది,  అంతా పరమాత్ముడి లీల అనుకోని, భాద్యత గా ముందుకు వస్తునాను.  నాకు ఎటువంటి చెడు అలవాటులు లేవు,  ఇతర సహకారము,స్పందన లేకపోవడం వలన సాధన కుదరక మెరుగ్గా ముందుకు రాలేకపోతున్నాను. గ్రహించగలరు.  నేను నిజమును కాబట్టి,  ఔషదం వలే చేదుగా ఉంటాను కొందరికి అనిపిస్తాను ఏమో,  లోపలికి  తీసుకొంటే, అనగా మనసు ప్రకారము తీసుకొంటే,  శాశ్వత అమృతముగా పని చేస్తాను.  నా ద్వారా ప్రకటితము అయిన కాలస్వరూపం యొక్క వివరములు అన్ని ఒక చోట పొందు పరుచుటకు మీ సహకారము మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ద్వారా కోరుకోనుచునాను.
నా వివాహము లోక కళ్యాణం అని గ్రహించి పండితులు, మేధావులు, మీడియా వారి సహకారముతో  కాలస్వరూపమును అవిష్కరించుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను.  
    

  నమస్కారములు

ఇట్లు తమ
ఆత్మీయులు,
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
   హైదరాబాద్ 
C/o Ntv, inews  and Bhakti  channels.
  
Copy to Media channels for information and necessary cooperation to establish kaalaswaroopam and launch of Samanvaya drusti as Political Party to contest in 2013.

Copy to Dr Jaya prakash Narayana gaaru, Lok satta party Convener
Copy to Sri Nara Chandra babu Naidu gaaru,Telugu Desham Party leader  
Copy to Smt Jayammagaaru, President Y Rajasekhar reddy  Congress party,
Copy to Sri G Krishna reddy gaaru, State President  Bharatiya janata Party for information 
Copy to Sri Kovelakuntla Chandra Sekhar rao gaaru TRS President for inforamtion and necessary cooperation.
and all other political parties of Andhra pradesh

(copy sent through email)

No comments: