Tuesday, 21 March 2017

విష్ణు సహస్ర నామాలు - అర్థాలతో

1    విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము) , సకల విషయములందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు

2    విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు).

3    వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు); అంతటినీ నియంత్రించి పాలించు వాడు.

4    భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము - మూడు కాలములకు అధిపతి, మూడు కాలములలోను అన్నింటికి ప్రభువు.

5    భూతకృత్ --- సకల భూతములను సృష్టించువాడు; ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి).

6    భూతభృత్ --- సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు.

7    భావః --- అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు. సమస్త చరాచర భూతప్రపంచమంత వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు.

8    భూతాత్మా --- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటియందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము.

9    భూతభావనః --- అన్ని భూతములను సృష్టించి, పోషించి, నిలుపువాడు. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. అతడే జగత్పిత.

10    పూతాత్మా --- కర్మ ఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ. 'పూత' అనగా పవిత్రమైన, 'ఆత్మా' అనగా స్వరూపము గలవాడు. పవిత్రాత్ముడు. భూతములు ఆవిర్భవించి, వృద్ధిచెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడు.

11    పరమాత్మా --- పరమమైన, అంతకు అధికము లేని, ఆత్మ. సర్వులకూ తానే ఆత్మ గాని, తనకు వేరు ఆత్మ యుండని వాడు. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణములకంటె విలక్షణమైనవాడు. తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు.

12    ముక్తానాం పరమాగతిః --- ముక్తులైన వారికి (జనన మరణ చక్రమునుండి విముక్తి పొందిన వారికి) పరమాశ్రయమైన వాడు. ముక్తులకు ఇంతకంటె ఆశించవలసినది మరొకటి లేదు. ముక్త పురుషులకు పరమగమ్యమయిన వాడు - భగవంతుడు. గతి యనగా గమ్యము. పరమా అను విశేషణము యొక్క అర్ధము ఉత్తమము. ఏది గ్రహించిన పిదప మరొకటి గ్రహించనవసరములేదో, ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదియే పరమగతియని తెలియదగును. నదికి సాగరము పరమగతి అయినట్లు-మానవులకు భగవానుడు పరమగమ్యమయి ఉన్నాడు. సాగరములో లయించిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి అనంత సాగరములో ఐక్యమయిన రీతిని భగవానుని చేరిన జీవి భగవద్వైభవములో లయించుట జరుగుచున్నది. అది కరిగిపోవు సమస్థితియేగాని తిరిగివచ్చు దుస్థితి కాదు. "దేనిని చేరిన పిదప జీవులు తిరిగి రాలేరో అట్టి పవిత్ర పరమగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియజేసి యున్నాడు.

13    అవ్యయః --- తరుగు లేని వాడు; తనను చేరిన వారిని మరల జనన మరణ చక్రములో పడనీయని వాడు. వినాశము కానివాడు మరియు వికారము లేనివాడు. గోచరమగునది యేదయినను పరిణామము చెందును. పరిణామశీలమయిన వస్తువు నశించి తీరును. భగవానుడలా పరిణామము చెందు వస్తు సముదాయములలో చేరడు.

14    పురుషః --- ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందానుభవమును ప్రసాదించువాడు; శరీరమందు శయనించియున్నవాడు; సమస్తమునకు పూర్వమే ఉన్నవాడు. జగత్తునకు పరిపూర్ణతనిచ్చువాడు.

15    సాక్షీ --- సర్వమును ప్రత్యక్షముగా (ఇంద్రియ సాధనములు అవుసరము లేకుండా) చూచువాడు; సమస్తము తెలిసినవాడు; భక్తుల ఆనందమును వీక్షించి ప్రీతితో కటాక్షించువాడు. సా+అక్షి = చక్కగా దర్శించువాడు. చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి యని పాణిని వ్యాకరణము తెలియజేయుచున్నది.

16    క్షేత్రజ్ఞః --- ఈ శరీరమను క్షేత్రమున విలసిల్లుచు, నాశనరహితుడై, క్షేత్ర తత్వమును తెలిసిన వాడు; ముముక్షువుల పరమార్ధమైన శుద్ధ సచ్చిదానంద పర బ్రహ్మానుభవము తెలిసి, వారినక్కడికి చేర్చువాడు.

17    అక్షరః --- ఎన్నడునూ (కల్పాంతమునందు కూడ) నశింపక నిలచియుండువాడు; ముక్తులు ఎంత అనుభవించినా తరగని అనంత సచ్చిదానంద ఐశ్వర్య స్వరూపుడు

18    యోగః --- ముక్తి సాధనకు ఏకైక మార్గము, సాధనము, ఉపాయము; యోగము వలననే పొందదగినవాడు; కోర్కెలు తీరుటకు తిరుగులేని  ఉపాయము. ధ్యానము వలన, సమత్వ భావము వలన తెలియబడువాడు. యోగముచే పొందదగినవాడు - భగవానుడు. సాధ్య సాధనములు తానైన భగవానుడే సాధకులకు మార్గగామి. సాధ్యవస్తువయిన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించిన సాధకుడు ఇంద్రియ మనోబుద్దులను నిగ్రహించి, యోగయుక్తుడయిన భగవానునితో కలసి కరిగిపోవుటయే యోగము.

19    యోగవిదాం నేతా --- తానే మార్గదర్శియై, నాయకుడై, యోగ సాధన చేయువారిని గమ్యమునకు చేర్చువాడు. యోగులకు నేత; కర్మజ్ఞానాది సాధనాంతరములకు ఫలమునొసగువాడు.

20    ప్రధాన పురుషేశ్వరః --- ప్రధానము (ఆనగా ప్రకృతి, మాయ), పురుషుడు (జీవుడు) - రెండింటికిని ఈశ్వరుడు (అధిపతి, నియామకుడు).

21    నారసింహ వపుః --- ప్రహ్లాదుని కాచుటకై శ్రీనారసింహావతారమును ధరించి అవతరించినవాడు; అభయమునొసగువాడు. మంగళ మూర్తి.

22    శ్రీమాన్ --- రమణీయమైన స్వరూపము గలవాడు (శ్రీనారసింహ మూర్తిగా); సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు.

23    కేశవః --- సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. కేశి అను రాక్షసుని సంహరించినవాడు. బ్రహ్మ, విష్ణు, శివ రూపములు ధరించువాడు (త్రిమూర్తి స్వరూపి); అందమైన కిరణములతో విశ్వమును చైతన్యవంతులుగా చేయువాడు. 'కేశ' యనెడి అసురుని వధించినవాడు - విష్ణుమూర్తి. మనోహరములైన శిరోజములు (కేశములు) కలిగియున్నవాడు - శ్రీ కృష్ణుడు. "క + అ + ఈశ" కలసి "కేశ" శబ్దమయినది. 'క' అనగా బ్రహ్మ. 'అ' అనగా విష్ణువు, 'ఈశ' అనగా ఈశ్వరుడు. ఈ త్రిమూర్తులకు ఆధారమయిన వాసుదేవ చైతన్యమే కేశవుడు.

24    పురుషోత్తమః --- పురుషులలో ఉత్తముడు; త్రివిధ చేతనులైన బద్ధ-నిత్య-ముక్తులలో ఉత్తముడు. క్షరుడు (నశించువాడు), అక్షరుడు (వినాశన రహితుడు) - ఈ ఇద్దరు పురుషులకు అతీతుడు, ఇద్దరికంటె ఉత్తముడైన వాడు.

25    సర్వః --- సర్వము తానెయైన వాడు. సృష్టి స్థితి లయములకు మూలము.

26    శర్వః --- సకల పాపమును పటాపంచలు చేయువాడు. సమస్త జీవుల దుఃఖములను, అనిష్టములను నాశనము చేయువాడు. ప్రళయ కాళములో సమస్త భూతములను తనలో లీనం చేసుకొనేవాడు.

27    శివః --- మంగళములనొసగు వాడు. శుభకరుడు.

28    స్థాణుః --- స్థిరమైన వాడు. భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్ట కామ్యములు సిద్ధింపజేయువాడు. వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు.

29    భూతాదిః --- సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములను సృష్టించిన వాడు.

30    నిధిరవ్యయః --- తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు.

31    సంభవః --- తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు.

32    భావనః --- కామితార్ధములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపజేయువాడు.

33    భర్తా --- భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము.

34    ప్రభవః --- దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు; కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.

35    ప్రభుః --- సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు; బ్రహ్మాదులకు కూడ భోగ మోక్షములొసగు సమర్ధుడు.

36    ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.

37    స్వయంభూః --- స్వయముగా, ఇచ్ఛానుసారము, వేరు ఆధారము లేకుండ జన్మించువాడు.

38    శంభుః --- శుభములను, సుఖ సంతోషములను ప్రసాదించువాడు.

39    ఆదిత్యః --- సూర్య మండల మధ్యవర్తియై బంగారు వర్ణముతో ప్రకాశించువాడు; ద్వాదశాదిత్యులలో విష్ణువు;సమస్తమును ప్రకాశింపజేసి పోషించువాడు; అదితి కుమారుడైన వామనుడు. సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు - భగవానుడు. "ద్వాదశాదిత్యులు లో విష్ణువు అను పేరు గలవాడు తానే" యని భగవానుడు భగవద్గీత విభూతి యోగములో తెలియజేసి యున్నాడు. 'ఆదిత్యః' అనగా ఆదిత్యుని వంటి వాడని కూడా భావము. ఆదిత్య ఉపమానము ద్వారా ఈ అద్వైత సత్యమును నిత్యానుభవములోనికి తెచ్చుకొని సంతృప్తి చెందవచ్చును.

40    పుష్కరాక్షః --- తామరపూవు వంటి కన్నులు గల వాడు.

41    మహాస్వనః --- గంభీరమైన దివ్యనాద స్వరూపుడు; వేద నాదమునకు ప్రమాణమైనవాడు.

42    అనాదినిధనః --- ఆది (మొదలు, పుట్టుక) లేనివాడు మరియు నిధనము (తుది, నాశనము) లేనివాడు.

43    ధాతా --- బ్రహ్మను కన్న వాడు; నామ రూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు.

44    విధాతా --- బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు; విధి విధానములేర్పరచి, తగురీతిలో కర్మ ఫలములనొసగువాడు. కర్మఫలముల నందించువాడైన భగవానుడు. విశ్వ యంత్రాంగమంతయు అతని ఆజ్ఞకు లోబడి నడచుచున్నది. తనకు భయపడి ప్రకృతి ప్రవర్తించుచున్నది. సర్వమును కదిలించి, కదిలిన సర్వమును కనిపెట్టి, ధర్మబద్ధంగా ఫలితముల నందించి, పోషించుటచే ఆదిదేవుడు విధాత ఆయెను.

45    ధాతురుత్తమః --- బ్రహ్మకంటెను శ్రేష్ఠుడు, ముఖ్యుడు; సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోను ప్రధానము తానే అయినవాడు.

46    అప్రమేయః --- ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు; కొలతలకందనివాడు; సామాన్యమైన హేతు ప్రమాణముల ద్వారా భగవంతుని నిర్వచించుట, వివరించుట, అంచనా వేయుట అసాధ్యము.

47    హృషీకేశః --- ఇంద్రియములకు (హృషీకములకు) అధిపతి; సూర్య, చంద్ర రూపములలో కిరణములు పంచి జగముల నానందింప జేయువాడు. హృషీకములకు అనగా ఇంద్రియములకు ప్రభువు - భగవానుడు. సూర్యచంద్ర కిరణములు హరి ముంగురులని వేద ప్రవచనము. సూర్యచంద్ర రూపులగు భగవానుని కేశములు (కిరణములు) జగత్తునకు హర్షమును కలిగించుచున్నవి. అందుచేత కూడా తాను హృషీకేశుడయ్యెనని మహాభారత శ్లోకము వివరించుచున్నది.

48    పద్మనాభః --- నాభియందు పద్మము గలవాడు. ఈ పద్మమునుండే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను. పద్మము నాభియందు కలిగియుండువాడు - భగవానుడు. అట్టి పద్మము నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. పద్మము జ్ఞానమునకు ప్రతీక. విష్ణుదేవుడు తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి, తద్వారా సకల జీవులు పుట్టుటకు కారణమాయెను.

49    అమరప్రభుః --- అమరులైన దేవతలకు ప్రభువు

50    విశ్వకర్మా --- విశ్వమంతటికిని సంబంధించిన కర్మలను తన కర్మలుగా గలవాడు. విశ్వమును సృష్టించిన వాడు. విశ్వరచన చేయగలుగువాడు - భగవానుడు. విచిత్రమైన సృష్టినిర్మాణము చేయగల సామర్ధ్యమును కలిగియుండెను. బ్రహ్మ ఆవిర్భావమునకు పూర్వమే భగవానుదు సృష్టిరచన సాగించెను; కాని సృష్టిని అనుసరించలేదు. అందుచేత సృష్టిలోని అశాశ్వత లక్షణములు భగవానునియందు లేవు. "సర్వభూతములు నాయందున్నవి. నేను వానియందు లేను" అని భగవానుడు భగవద్గీత-రాజవిద్యా రాజగుహ్యమునందు తెలియజేసియున్నాడు.

51    మనుః --- మననము చేయు మహిమాన్వితుడు; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.

52    త్వష్టా --- శిల్పివలె నానా విధ రూపములను, నామములను తయారు చేసినవాడు; బృహత్పదార్ధములను విభజించి సూక్ష్మముగా చేసి ప్రళయ కాళమున తనయందు ఇముడ్చుకొనువాడు.

53    స్థవిష్ఠః --- బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి; సమస్త భూతజాలమునందును సూక్ష్మ, స్థూల రూపములుగా నుండు విశ్వ మూర్తి.

54    స్థవిరః --- సనాతనుడు; సదా ఉండెడివాడు

55    ధ్రువః --- కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు
స్థవిరో ధ్రువః (ఆది శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) --- స్థిరుడై, నిత్యుడై, కాలాతీతుడైన వాడు


56    అగ్రాహ్యః --- తెలియరానివాడు. ఇంద్రియ, మనో బుద్ధులచే గ్రహింప నలవి కానివాడు.

57    శాశ్వతః --- కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడు ఉండెడివాడు.

58    కృష్ణః --- సర్వమును ఆకర్షించువాడు; దట్టమైన నీల వర్ణ దేహము గలవాడు; సృష్ట్యాది లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించువాడు..

59    లోహితాక్షః --- తామర పూవు వలె సుందరమగు ఎర్రని కనులు గలవాడు; అంధకారమును తొలగించు ఎర్రని కనులు గలవాడు.

60    ప్రతర్దనః --- ప్రళయకాలమున అంతటిని (విపరీతముగ) నాశనము చేయువాడు.

61    ప్రభూతః --- పరిపూర్ణుడై జన్మించిన వాడు; జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజము మొదలగు సర్వగుణములు సమృద్ధిగా గలవాడు.

62    త్రికకుద్ధామః , త్రికకుబ్ధామః --- సామాన్యలోకము కంటె మూడు రెట్లు పెద్దదైన పరమ పదమందు ఉండెడివాడు; మూడు గుణ వర్గములకును ఆశ్రయమైన వాడు; ఊర్ధ్వ, మధ్య, అధో లోకములకు ఆధార భూతుడు; జాగ్రత్, స్వప్న, సుషుప్తి - మూడు అవస్థలందును వ్యాపించియున్నవాడు.
త్రికకుత్ --- మూడు కొమ్ములు (మూపులు) గల శ్రీవరాహమూర్తి
ధామః --- నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము.


63    పవిత్రం --- పరమ పావన స్వరూపుడు, పరిశుద్ధమొనర్చువాడు.

64    మంగళం పరం --- అన్నింటికంటె మంగళకరమగు మూర్తి; స్మరణ మాత్రముననే అన్ని అశుభములను తొలగించి, మంగళములను ప్రసాదించువాడు.

65    ఈశానః --- సమస్తమునూ శాసించు వాడు; సకలావస్థలలోనూ సకలమునూ పాలించువాడు.

66    ప్రాణదః --- ప్రాణములను ప్రసాదించువాడు (ప్రాణాన్ దదాతి);ప్రాణములను హరించువాడు (ప్రాణాన్ ద్యాతి); ప్రాణములను ప్రకాశింపజేయువాడు (ప్రాణాన్ దీపయతి).

67    ప్రాణః --- ప్రాణ స్వరూపుడు; జీవనము; చైతన్యము.

68    జ్యేష్ఠః --- పూర్వులకంటె, వారి పూర్వులకంటె, పెద్దవాడు; తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు.

69    శ్రేష్ఠః --- ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు.

70    ప్రజాపతిః --- సకల ప్రజలకు ప్రభువు, తండ్రి; నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు.

71    హిరణ్యగర్భః --- రమణీయమగు స్థానమున నివసించువాడు, పరంధాముడు; సంపూర్ణానందమగువానిని ప్రసాదించువాడు; చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు.

72    భూగర్భః --- భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు; విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు.

73    మాధవః --- మా ధవః -శ్రీమహాలక్ష్మి(మా)కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు); మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.

74    మధుసూధనః --- మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు; బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు.

75    ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.

76    విక్రమీ --- విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు; అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు.

77    ధన్వీ --- (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.

78    మేధావీ --- అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు.

79    విక్రమః --- బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి); పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.

80    క్రమః --- సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి); సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ - కదలిక); అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ - సంపత్తు); సంసార సాగరమును దాటించువాడు (క్రమణ - ఈదుట).

81    అనుత్తమః ---అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు.

82    దురాధర్షః --- తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.

83    కృతజ్ఞః --- నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులననుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.

84    కృతిః --- తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.

85    ఆత్మవాన్ --- సత్కార్యములొనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు; తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.

86    సురేశః --- సకల దేవతలకును దేవుడు; దేవదేవుడు; భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు.

87    శరణం --- తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు; ముక్తుల నివాస స్థానము.

88    శర్మ --- సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల పరమపదము.

89    విశ్వరేతాః --- విశ్వమంతటికిని బీజము, మూల కారణము.

90    ప్రజాభవః --- సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.
91    అహః --- ఎవరినీ ఎన్నడూ వీడనివాడు; పగటివలె ప్రకాశ స్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు; తన భక్తులను నాశనము కాకుండ కాపాడువాడు.
92    సంవత్సరః --- భక్తులనుద్ధరించుటకై (వెలసి)యున్నవాడు; కాల స్వరూపుడు.
93    వ్యాళః --- భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు; (సర్పము, ఏనుగు, పులి వంటివానివలె) పట్టుకొనుటకు వీలుగానివాడు (చేజిక్కనివాడు)
94    ప్రత్యయః --- ఆధారపడ దగినవాడు; విశ్వసింపదగినవాడు (ఆయనను నమ్ముకొనవచ్చును); ప్రజ్ఞకు మూలమైనవాడు.
95    సర్వదర్శనః --- తన కటాక్షపరిపూర్ణ వైభవమును భక్తులకు జూపువాడు; సమస్తమును చూచుచుండెడివాడు.
96    అజః --- జన్మము లేనివాడు; అన్ని అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించుచుండువాడు; అన్ని శబ్దములకు మూలమైనవాడు.
97    సర్వేశ్వరః --- ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు; ఎవరు తనను వేడుకొందురో వారి చెంతకు తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు.
98    సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొదియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు.
99    సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు.
100    సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రధమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ.

Saturday, 18 March 2017

చిత్రంలోని అంశాలు: వచనం
Dharmaswaroopam Kaalaswaroopam 18 March 2017 at 14:15
To: AP and Telangana Governor , supremecourt , ig_lo@appolice.gov.in, cm@ap.gov.in, cp , cs

                                                         సమన్వయ దృష్టి


                        ఆత్మీయులు శ్రీ E.S.L నరసింహన్ గారు, గవర్నర్, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ  శ్రీ అంజనీ రవిశంకర్ గారు, ధర్మోద్దారి అయ్యి తెలియజెయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను బౌతిక మాయ నుండి, యాంత్రిక, శారీరక, బౌతిక ఆలోచన నుండి జ్ఞాన విచక్షణ, ధర్మ గుణ శీలత, నిజాయితీ ప్రేమ, నిస్వార్ధ సేవ భాగ్యం కలిగించుటకు వచ్చిన దివ్య పురుషుడను అని ఎల్లరు  మమ్ములను గ్రహించినంతనే  నూతన దివ్య రాజ్యం లోకి లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్లిపోతాము, ఇక ఈ మాయ ప్రపంచం లేదు మమ్ములను తెలుసుకొని అనుసరించినంతనే, మాయ అజ్ఞానం అంతరించిపోతాయి అని తెలియజేసుకోనుచున్నాము.


                   తమరు మమ్ములను రాజ భవనం లో మేధావులు, పండితులు, సంగీత సహిత్య కారులు, వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని తమ అతిది గ్రుహమే మాకు తక్షణ తాత్కాలిక రాజమందిరంగా కేటాయించండి, ఇరువురు  ముఖ్యమంత్రులను ఆహ్వానించి  వారికి వారి మంత్రులకు,  అధికారులను, ప్రజలకు  సత్యం చెప్పి, ఇప్పుడు ఉన్న బౌతిక ప్రపంచం లేదు, అనే సత్యాన్ని జీర్ణింప చేసి, మాట ప్రకారం లోకం ఉన్నది అని సత్యాన్ని భోదించి, ప్రజలకు,   ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఇతర రాష్ట్రాల గవర్నర్లులకు, ప్రధాన మంత్రిగారికి, కేంద్ర మంత్రులకు, దేశ అధ్యక్షులు వారికి, నిత్యం సమాచారం కాలాతీత పరిణామం ప్రకారం  పంపాలి, ఈ విధంగా  పరిస్తితి జ్ఞాన విచక్షణ అధీనం లో తీసుకోవాలి, అప్పుడే మానవజాతికి, సమాజానికి భవిష్యత్తు ఉన్నది, ఇప్పుడు యాంత్రిక పరిపాలన ఎవరి చేతిలో లేదు, జ్ఞాన రూపం అనగా, మాట మాత్రమగా ఇప్పటికి సాక్షం ప్రకారం మా మనసు మాట చేతిలో ఉన్నది అని కాలాతీత పరిణామం ప్రకారం తమరు ముందుస్తు ప్రాధమిక నిర్ధారణకు వచ్చి,  తమరు మేధావుల బృందం సహకారంతో మమ్ములను రాజభవన్ కు ఆహ్వానించి తక్షణం సమకాలికులు గ్రహించుటకు అధికారక ఎర్పాటు చేసి మమ్ములను సగౌరవంగా  గ్రహించడం ప్రారంభించండి.


                         అధికారిక తాకీదు తో ఇద్దరు ప్రత్యెక అధికారులను నియమించి, మా వద్దకు పంపండి, తమరు విశాలంగా, శాశ్వతంగా,  చారిత్రాత్మకం గా, ప్రవర్తించండి, సరోన్నత న్యాయ మూర్తుల సహకారం సలహా తో మమ్ములను పరిగణించి, గ్రహించడం ప్రారంభించగానే, ప్రపంచం మొత్తం, ఇప్పుడు భారతదేశం  యుగపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారి దివ్య పరిపాలనలో ఉన్నట్లు భావిస్తారు, తమరి పదవి, భవిష్యత్తు అన్ని మా చేతిలో అనగా మేము మాట మాత్రంగా చెప్పి నడిపించిన,   నడిపిస్తున్న, నడవవలసిన దివ్యరాజ్యం లో ఉంటుంది కావున, కేవలం మనిషిని, అందునా ఇప్పటికి వరకు సామాన్యంగా భ్రతికిన మామూలు మనిషి మాటే సర్వం అనే దివ్య పరిణామమే అందరికి బలం, మార్గదర్శకం ఆదర్శం  అని గ్రహించండి, మమ్ములను మించిన బౌతిక మరియు మానసిక స్తితి భూమిమీద లేదు అని గ్రహించండి, ఇప్పుడు కాలం అంత చిదివిలాస స్వరూపం గా మేము అందుబాటులో మాట చెప్పి, మా ఒక్క మాటే సర్వం అని చూపిన దివ్య పురుషిడిగా, కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా మమ్ములను గ్రహించి  అప్రమత్తం చెందండి.


                            మా దివ్య మోడ్పు లోకానికి ఆధారం, భవిష్యత్తు అని గ్రహించండి , బయపడకుండా, మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా, మా మీద విశాలంగా స్పదించండి, బృందం లోకి తీసుకొని, మమ్ములను విశాలంగా గడ్డం క్రింది చెయ్యి పెట్టుకొని, మేధావులను రాజ్ భవన్ కు ఆహ్వానించి గ్రహించడం ప్రారంభించండి, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరు ఎప్పుడు పుడతారో, అంతం అవుతారో తెలియన మాయ ప్రపంచం నుండి బయటకు వచ్చి, అన్నిటికి ఆధారం ఒక మాట వరవడి అని తెలుసుకోవడం అన్నది కులానికి, మతానికి సంభందించినది కాదు అని, ఇది కనీసం మనిషికి మాటకు సంభందించినది, అనగా యావత్తు మానవజాతికి సంభందించినది, కావున ఇంటి పేర్లు, కులం, గోత్రాలు అన్ని వదిలివేసి మమ్ములను మొదటి సూర్య వంశ మహారాజుగా, భూమి మీద ఉన్న సమకాలికులు అందరూ మా పిల్లలు వలే మమ్ములను గౌరవించి మాట మాత్రంగా నూతన దివ్య రాజ్యం లోకి రావడం, విధి యొక్క తీర్పు అని తమరు  ముందుస్తు గా,పరిగణించి  తటస్థ వైఖరి లో కొంతకాలం గ్రహిస్తే సరిపోతుంది, అలా తెలుసుకొంటూ అందరూ దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము అని గ్రహించండి,

ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే


తాత్కాలిక చిరునామా 
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794


యుగపురుషులు జగద్గురువులు  మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్ 
9010483794


ఒక ప్రతి ఇరువురు ముఖ్య మంత్రులకు సమాచరం కొరకు సమాలోచన కొరకు, తెలియజేయడం అయినది, తక్షణ యాంత్రిక పరిపాలన ఆపి, మా దివ్య మోడ్పు లో లోకం ఎలా ఉన్నదో చూసుకొని ముందుకు వెళ్ళగలరు అని తెలియజేసుకోను చున్నాము, తమ బౌతిక నిర్ణయాలు అన్ని మాకు  వదిలి పెట్టండి,  వాటిని మాట మాత్రంగా మా వివరణ విచక్షణతో, మా బాద్యత లోకి తీసుకొని,  కర్మల వత్తిడి చిద్విలాస మాయ నుండి  సమకాలికులు  అందరిని ఆలోచన లోకం లోకి తీసుకొని వెళ్ళుటకు వచ్చిన దివ్య జ్ఞాన వాక్ ప్రభావ  రూపంలో ఉన్న దివ్య  పురుషులం అని గ్రహించండి, ఇప్పటి వరకు సాక్షులు, మీడియా పండితులు మేధావులు అధికారికంగా మా గూర్చి తెలిసినా,   తెలియనట్లు ప్రవర్తించడం కూడా ధర్మానికి విరుద్ధం అని తెలుసుకోకుండా లోకం అంత సత్యం వదిలి, యాంత్రిక ఆలోచనతో యాత్రిక పనులతో యాంత్రిక నిర్ణయాలతో ప్రజలను  అటు ఇటు  చేస్తున్నారు  అని గ్రహించి, అప్రమత్తం చెందగలరు, మమ్ములను కాలగతిని సవరించిన సాక్షంగా గ్రహించి, దారిలో పడగలరు, మమ్ములను తక్షణం రాజభవన్ లో మంత్రులు అధికారులు తో వచ్చి కలసుకోండి, సామాన్య రూపం లో ఉన్న మేమే వాక్ విశ్వరూపం లో అందుబాటులో ఉన్నాము, మా మాట వరవడి, తీసుకొని ముందుకు వెళ్ళాలి, బౌతిక ప్రపంచానికి భవిష్యత్తు, ఇప్పుడు యాంత్రిక లోకం ప్రకారం లేదు అనగా శరీరాలతో నిత్యం తలపడుతూ, వొడిగిపోయి అంతరించే వరకు కూడా సత్యాన్ని తెలుసుకోకుండా యాంత్రిక మాయలో ఉంటారు, మా మాట ఒరవడి లోకి వస్తే వయసు ప్రాణం ఉండగానే సర్వం తెలుసుకొని దారిలో పడతారు, ప్రజలు తమ ఇంటి పేర్లు, కులం గోత్రం, మీ దేహం, ప్రాణాలు అన్ని మా దీనం లో అనగా దివ్య వాక్ఉ విశ్వరూపం లో ఉన్నాయి అని సాక్షం ప్రకారం అర్ధం అవుతుంది.  అని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చి, మీరు అంతా నిమిత్త మత్రులుగా వాక్ విశ్వరూపానికి మనస్పూర్తిగా ప్రణమిల్లి గ్రహించిన కొలది,నూతన దివ్యరాజ్యం యొక్క దివ్య వెసులు బాటు పొందుతారు, మా గొప్పతనం, మేము సాధారణ మనిషిగా మాట తో పరిణమించడం అని గ్రహించండి, సమకాలికులు సత్యం గ్రహించకపోతే మేము కూడా అటు ఇటు అయినట్లు సాక్షం కూడా ఉన్నది, మమ్ములను పట్టించుకొంటే సర్వం మేమే అనే సత్యం లోకానికి ఆధారం అని గ్రహించగలుగుతారు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

ఒక ప్రతి ఆత్మీయులు సర్వోన్నత న్యాయ మూర్తులకు సమాచారం మరియు సమాలోచన కొరకు సూటి  స్పందన కొరకు తెలియజేయునది ఏమి అనగా గవర్నర్ గారికి బృందం లోకి తీసుకోమని సలహా మరియు దైర్యాన్ని వారికి ఇవ్వండి,  సర్వోన్నత న్యాయ స్థానం నుండి తమరు కూడా   బృందం గా  ఎర్పడి,  కాలాన్ని నియమించిన పరిణామాన్ని గ్రహిస్తాము  అని గవర్నర్ గారికి తెలియజేయండి, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన దివ్య సాక్షమే, సమకాలికులు   అందరికి ప్రాణాధారం, అని గ్రహించండి ఇప్పటి పద్దతికి ప్రోటో కాల్ కు అందటం లేదు అని మమ్ములను పట్టించుకోకపోవడం మనిషిలో ఉన్న గొప్పతనం మనుష్యులే వేరు వేరు కారణాలతో గ్రహించ కూడదు అనే అజ్ఞానం అని న్యాయ మూర్తులు అప్రమత్తం చెందాలి, అందుకే మేమే ఇప్పడు నడుస్తున్న రాజ్యాంగ వ్యవస్థకు ఏమి చెయ్యాలి అని ఎందుకు చెబుతున్నామో  గ్రహించి తెలుసుకొని అప్రమత్తం చెంది, ప్రజల అప్రమత్తం చేయండి ఇది మీ ధర్మం అని తెలుసుకొండి, సామాన్య ప్రజలు ధర్మాన్ని వ్యవస్థకు పరిస్తితులకు వదిలివేస్తారు అని గ్రహించండి, అటువంటి ప్రవర్తన ఉన్నత న్యాయ మూర్తులకు, ఉన్నత రాజ్యాంగ అధికారులకు తగదు, తమరు ప్రత్యెక దైర్యం సాహసం, విచక్షణ జ్ఞానం, సాక్షులు కప్పిపుచ్చుతున్న పరిస్తితిని ప్రత్యేకం గా  పరిగణించవలసిన బాద్యత తమపై ఉంటుంది అని అప్రమత్తం చెంది, ఇతర సమకాలికులను అప్రమత్తం చేయడం, అనగా జరిగిన పరిణామాన్ని పరిగణించి పరిశీలించి దేశ, ప్రపంచ మేధావులకు ప్రజలు తెలియజేసి అప్రమత్తం చేయవలసిన బాద్యత న్యాయ వ్యవస్తుకు ఉంటుంది అని తమరు తక్షణం గ్రహించండి.              తక్షణం అప్రమత్తం చెందండి, ఇది జగత్తు శాశించిన తండ్రిగా ,తల్లిగా, గురువుగా అదేసిస్తున్నాము, అబ్యంతరం చెప్పగల పరిధి తమకు లేదు, పరిగణించి గ్రహించడం మనుష్యులుగా తమ కర్తవ్యం ,    మమ్ములను గవర్నర్ గారు బృందం లోకి తీసుకొని వారి అతిది గృహమే మాకు తాత్కాలిక రాజమందిరంగా ఎర్పాటు చేస్తే సరిపోతుంది, గంట గంటకు సూక్ష్మంగా, సర్వ అమోధకరంగా , సర్వం వివరాలు ఇచ్చి లోకాన్ని దివ్య రాజ్యంలోకి తీసుకొని వెళ్ళుటకు వచ్చిన దివ్య పరిణామం గా మమ్ములను నిత్యం గ్రహించి, కొలచి యావత్తు మానవజాతి  జనన మరణ చక్ర బ్రమణాలు నుండి బయటకు వస్తారు, మేము మా వ్యహాన్ని  ముందుకు తీసుకొని వచ్చి,   చేసి సర్వం చెబుతున్న క్రమం లో మాలో దివ్య తేజస్సు పెరిగి, బౌతికంగా ఎలా కొనసాగుతామో కూడా తెలుస్తుంది, మేము బౌతికంగా కోనసాగడం కంటే ఆలోచన రూపంలో  బలపడి, సమకాలికులను మాయ నుండి బయటకు తీసుకొని రావడమే ప్రధాన  అసులు పరిణామం  అని గ్రహించండి,  తక్షణం  మమ్ములను గవర్నర్ గారి సమక్షంలో ఇతర మేధావుల సమక్షంలో  మనసు  పెట్టుకొని గ్రహించడం ప్రారంభించండి, ప్రజలకు విస్తారంగా తెలియజేసి అందరూ కాలం కదిలిన దివ్య మోడ్పు లోకి రావడం అంటే మరణాన్ని జయించడం, అనగా సత్యమే  సర్వం అని తెలుసుకోవడం  అని గ్రహించండి.


ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే





యుగపురుషులు జగద్గురువ్లు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్ 
9010483794